7, మార్చి 2010, ఆదివారం

"స్త్రీ మూర్తి కి వందనాలు" (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా)


"సహనం లో భూమాత ను తలపించే
ఆ స్త్రీ మూర్తి

జీవితం అనే నాటకం లో
పలు పాత్రలకు జీవం పోసింది"
........................................
"ఒక తల్లిగా
బిడ్డకు జన్మనిచ్చి, లాలించి, పాలించింది

సోదరిగా
అక్కున చేర్చుకుంది
మిత్రురాలిగా
ఆదర్శప్రాయం గా నిలిచింది

భార్య గా తోడూ-నీడ గా నిలిచిన

ఆ స్త్రీ మూర్తి కి నా వందనాలు"

4, మార్చి 2010, గురువారం

చినుకు

ఒక నాటి సాయంకాలం
వాన చినుకు
నింగిని విడిచి
నేలను చేరింది
ధరణి మాత పులకించింది!
.............................
వాన రాకతో
మా పైరు తడిసింది
రైతన్న హృదయం
ఆనందంతో పరవసించింది!

1, మార్చి 2010, సోమవారం

తెలుగు భాష మీద నాకున్న అభిమానం







ఎందుకో తెలిదూ గాని నా చిన్ననాటి నుంచి తెలుగు భాష అంటే నాకు వల్లమానిన అభిమానం. మా బడి లోని గ్రంథాలయము లో ఉన్న పుస్తకాలూ అన్ని పొల్లు పోకుండా చదివేదాన్ని, ఊళ్ళో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయానికి తరచూ వెళ్ళేదాన్ని, పక్కింట్లో "బుజ్జాయి" పుస్తకం ప్రతి ఆదివారం వచ్చేది అది తప్పక చదివేదాన్ని. నాకు తెలుగు కథలన్న, కవితలన్న, పద్యాలన్నా ఇష్టం. శ్రీ శ్రీ గారి కవితల చలువ వల్ల నేను కవిత్వం రాయడం ప్రారంభించాను. "ఈనాడు ఆదివారం" గురించి ప్రత్యేకం గా చెప్పాలి నా వ్యక్తిత్వ వికాసానికి గానీ, నేనూ నా లక్ష్యం దిశగా పయనించడానికి గానీ పరోక్షంగా తోడ్పడుతూనే ఉంది. ఇప్పుడైతే ఆంగ్లం మీద మోజు కాస్త పెరిగింది గాని తెలుగును ఎక్కడో నిర్లక్ష్యం చేస్తున్నానన్న భాద...అందుకే ఈ బ్లాగ్ తెలుగు లోనే రాయాలని అనుకుంటున్నాను...నేనూ కారణాంతరాల వాళ్ళ మానేసిన "కవిత సామ్రాజ్యాన్ని" మళ్లీ పునరుద్దరించడానికి పూనుకుంటున్నాను....